వేడెక్కిన తెలంగాణ: నేడు విద్యాసంస్థల బంద్కు పిలుపు

కోర్ కమిటీ వాయిదాల కమిటీగా మారిందని తెలంగాణ జెఎసి వ్యాఖ్యానించింది. ఎవరి దయతోనూ తెలంగాణ రాదని, మన బలంతోనే తెలంగాణ సాధ్యమని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. సంఘటితంగా పోరాడి తెలంగాణ సాధించుకుంటామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు సాచివేత వైఖరి గర్ఙనీయమని ఆయన అన్నారు. ఈ నెల 16 లేదా 17వ తేదీ నుంచి ఉధృతంగా జనచైతన్యయాత్రలు చేపడుతామని ఆయన అన్నారు.
కాంగ్రెసు కోర్ కమిటీ నాటకం మరోసారి బయటపడిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్సించింది. తెలంగాణ అంశంపై నిర్వహించిన కాంగ్రెసు కోర్ కమిటీ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఆ పార్టీ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టురామచంద్రరావు అన్నారు. ఇలాంటి మోసం జరుగుతుందని ముందే ఊహించామని వారన్నారు. కాంగ్రెసు కోర్ కమిటీ కాదని, అది చోర్ కమిటీ అని వారు వ్యాఖ్యానించారు.
కాంగ్రెసు కోర్ కమిటీ తెలంగాణపై తేల్చకపోవడాన్ని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పు పట్టారు. కాంగ్రెసు తెలంగాణపై తేల్చకుండా తమ వైఖరిని అడిగిందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు మోసపూరిత వైఖరి మరోసారి బయటపడిందని ఆయన అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications