వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కరు లేకుంటే ఇలా, టైమ్ వస్తే బుద్ధి చెప్పాలి: షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

 YSR thought about welfare of people: Sharmila
విజయనగరం: ఒక్క మనిషి లేకపోవడంతో రాష్ట్రం అతలాకుతలం అవుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల సోమవారం అన్నారు. షర్మిల పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతి వర్గానికి సేవ చేశారని, అందుకే ఈ రోజు కులాలు, మతాలకు అతీతంగా ప్రజలు ఆయనను గుర్తు పెట్టుకున్నారని, ఆ ఒక్క మనిషి లేకపోవడం వల్ల రాష్ట్రం అతలాకుతలమైందన్నారు.

పేదలంటే ఆయనకు ప్రేమ అని, ఇప్పుడున్న పాలకులు అసలు ప్రజల గురించి ఆలోచనే చేయడం లేదన్నారు. వైయస్సార్ ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అయినా ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందరి పక్షాన నిలబడుతుందన్నారు. గుజరాత్‌ను మించేలా ఇక్కడున్న గ్రానైట్ పరిశ్రమను జగన్ తీర్చిదిద్దుతారన్నారు. అందరం సమయం వచ్చినప్పుడు మిగిలిన పార్టీలకు బుద్ధి చెప్పి జగన్‌ను ఆశీర్వదిస్తే సుభిక్ష రాజ్యం వస్తుందన్నారు.

ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఎలాంటి కష్టాలు ఉండవన్నారు. వైయస్ ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలబడాలని అహర్నిషలు తపించారన్నారు.

సోమవారం 210 వరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చీపురుపల్లి నియోజకవర్గంలోని ఆకులపేట గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి బాగు వలస, వెదుల్ల వలస, వెంకటాపురం ఎక్స్ రోడ్, బిళ్లల వలస మీదుగా గర్భం చేరుకున్నారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.15 గంటలకు చేరుకున్నారు. మొత్తం 16.3 కిలోమీటర్లు నడిచారు.

English summary
YSR Congress Party leader Sharmila on Monday said that late YS Rajasekhar Reddy thought about welfare of people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X