ఎన్టీఆర్ దూరం: చంద్రబాబుకు కళ్యాణ్ రామ్ చేరువ?
హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకీ తనకూ దూరమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కళ్యాణ్ రామ్ను చేరదీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన బావ మరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యుల నుంచి కళ్యాణ్ రామ్ను చేరదీయడం ద్వారా నందమూరి కుటుంబ సభ్యులు తమ వైపు ఉన్నారని చాటుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
కళ్యాణ్ రామ్ చెమటోడ్చి తీసిన ఓం త్రీడి సినిమాను చంద్రబాబు వీక్షించి, దానికి కితాబు ఇచ్చారు. ఓంను అద్భుతమైన సినిమాగా చంద్రబాబు అభివర్ణించారు. సాధారణంగా సినిమాలకు దూరంగా ఉండే చంద్రబాబు చాలా తక్కువ సందర్భాల్లో సినిమాలు చూసి కితాబులు ఇచ్చారు. తాజాగా, గురువారంనాడు ఆయన ఓం సినిమా చూసి కళ్యాణ్ రామ్ను మెచ్చుకోవడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుందని భావిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ను పార్టీకి దూరంగా ఉంచాలని చంద్రబాబుతో పాటు నందమూరి హీరో బాలకృష్ణ కూడా నిర్ణయించినట్లు సమాచారం. నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబుకు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య సయోధ్యకు కళ్యాణ్ రామ్ ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఆ సయోధ్య ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది.
కళ్యాణ్ రామ్ మొదటి నుంచి చంద్రబాబుకు సన్నిహితంగానే ఉంటున్నారు. అలాగే, మరో నందమూరి హిరో తారకరత్న కూడా చంద్రబాబుకు, బాలకృష్ణకు మధ్దతు ప్రకటిస్తున్నారు. తనను ఆహ్వానించి ఉంటే మహానాడుకు వెళ్లి ఉండేవాడినని జూనియర్ ఎన్టీఆర్ మాటలతో విభేదిస్తూ తారకరత్న ప్రకటన చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని, ఒకరు ఆహ్వానించాల్సిన అవసరం లేదని తారకరత్న అన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications