వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనర్ నిందితుడు: గ్యాంగ్ రేప్‌నకు ముందు దోపిడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Juvenile accused
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో నిందితుడైన మైనర్ బాలుడు ఓ దొంగ అని తేలింది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన మైనర్ బాలుడిని మరో కేసులో దోషిగా కోర్టు ప్రకటించింది.

నిర్భయపై అత్యాచారానికి కొద్ది రోజుల ముందు ఈ మైనర్ నిందితుడు దొంగతనానికి పాల్పడ్డాడు. అతనిని దొంగగా నిర్ధారించిన కోర్టు, నిర్భయ ఉదంతంలో కూడా నిందితుడైనందున ఇతనికి జూలై 25న శిక్ష ఖరారు చేయనుంది.

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారంలో పాల్గొనడానికి ముందు మైనర్ నిందితుడు ఓ వడ్రంగిని నిరుడు డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్బంధించి, దోపిడీకి పాల్పడినట్లు తేలింది. నిర్భయ తన మిత్రుడితో పాటు బస్సులో ఎక్కడానికి ముందు రామధర్ అనే వడ్రంగి ఆ బస్సులో ఎక్కాడు.

కదులుతున్న బస్సులో డిసెంబర్ 16వ తేదీన ఆరుగురు వ్యక్తులు విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పిడన విషయం తెలిసిందే. సామూహిక అత్యాచారానికి గురైన అమ్మాయి డిసెంబర్ 29వ తేదీన సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. మైనర్ నిందితుడితో పాటు మరో నలుగురు నిందితులు ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరిపింది. మరో నిందితుడు రామ్ సింగ్ మరణం పాలైన విషయం తెలిసిందే.

English summary
The juvenile justice board has held the minor guilty of illegally confining and robbing a carpenter on December 16 night before allegedly participating in the gang rape of a 23-year-old girl in a moving bus here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X