కానిస్టేబుల్ దుశ్చర్య: లేడీ పోలీసుపై అత్యాచారయత్నం

ఎన్నికల విధులు నిర్వహించేందుకు కడప జిల్లాకు వచ్చిన మహిళా ట్రైనీ కానిస్టేబుల్పై అతను దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. లేడీ కానిస్టేబుల్క స్థానిక సరస్వతి కళాశాలలో విధులు కేటాయించారు. కళాశాల పక్కనే ఉన్న ఇంట్లో వసతి కల్పించారు.
ఈ ఇంట్లోకి కానిస్టేబుల్ ప్రవీణ్ రాజు ఆమెను పిలిపించుకుని వెళ్లి అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై లేడీ ట్రైనీ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
విద్యార్థినిపై పిఇటి అసభ్య ప్రవర్తన
విశాఖపట్నం జిల్లాలోని యారాడ బీచ్లో ఓ విద్యార్థిని పట్ట పీఈటీ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు పీఈటీని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
యువకుడిపై యాసిడ్ దాడి
కరీంనగర్ జిల్లాలోని సివిల్ ఆస్పత్రి సమీపంలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్తో దాడి చేశారు. కారులో వచ్చిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. స్థానికులు వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications