శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిల యాత్ర: సెక్యూరిటీ దాడి, యువకుడికి గాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో ఆమె పలువురుని కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. దారిలో కలుస్తున్న వారిని పలుకరిస్తూ ముందుకు కదులుతున్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఆమె మాట్లాడారు.

చేనేత కార్మికుల బాగు కోసం ఏం చేయాలనే అంశాన్ని జగన్ ఎప్పుడో ఆలోచన చేశారని ఆమె అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాడు తీసుకు వచ్చిన పథకాలన్నింటిని జగన్ ముఖ్యమంత్రి అయితే అమలు చేస్తారన్నారు.

శుక్రవారం షర్మిల పాదయాత్ర 221వ రోజుకు చేరుకుంది. ఆముదాలవలస నియోజకవర్గంలోని శిలగాంసింగువలస గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. గుండువిల్లిపేట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రంలో షర్మిల విశ్రాంతి తీసుకున్నారు. ఆమె 14 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు 2,969 కిలోమీటర్లు నడిచారు.

సెక్యూరిటీ అత్యుత్సాహం

షర్మిల పాదయాత్ర సందర్భంగా వ్యక్తి గత భద్రతా సిబ్బంది అత్యుత్సాహంతో ఓ యువకుడు గాయాలపాలయ్యాడు. మడపాం టోల్‌ ప్లాజా సమీపంలో షర్మిలను చూసేందుకు మడపాం యువకులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆమె వ్యక్తిగత సిబ్బంది కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సంతోష్ అనే యువకుడికి తలపై బలమైన గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయగా, స్థానిక నేతలు నచ్చచెప్పారు.

English summary
YSR Congress Party leader Sharmila is continuing her 
 
 Maro Praja Prasthanam Padayatra in Srikakulam 
 
 district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X