జగన్ కోసం ఆగేది లేదు, బాబు ఏం చేస్తారో: టిపై సబ్బం
జగన్ను ఇబ్బంది పెట్టవద్దని ఇన్నాళ్లు ఆగామని, ఆయన ఆడిస్తున్న నాటకంగా అందరూ ఆరోపిస్తారని ఊరుకున్నానని, విభజన ప్రక్రియ జరుగుతుంటే తమ నిర్ణయం చెప్పే రోజు వచ్చిందన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. సమైక్యానికి అనుకూలంగా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తాను ఉంటానని చెప్పారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమ నిర్ణయాలను స్పష్టంగా చెప్పక పోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది కాంగ్రెసు పార్టీయేనని మండిపడ్డారు. కాంగ్రెసుది నాటకోమో లేదా తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ లాంటి వాళ్లు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.
కాంగ్రెసు ఏ నిర్ణయం తీసుకోదని, మౌనంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలకు ఆదేశించినట్లుగా తెలుస్తోందన్నారు. తెలంగాణ ఇస్తే జగన్ ఏం చేస్తారో చూడాలన్నారు. కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ వంటి నేతలకు ప్రజలతో సంబంధాలు అలాంటి వారే, చిదంబరం వచ్చేసారి గెలుస్తారో లేదోనని, అలాంటి నేతలు రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారని మండిపడ్డారు.