టి: కాంగ్రెస్పై మమత మండిపాటు, తెరాస విలీనంపై డిగ్గీ
తెలంగాణ డిమాండ్ సమంజసమే కానీ, ఐదేళ్లపాటు తన హామీని నానబెట్టిన యూపిఏ, ఇప్పుడెందుకు దేశాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టిందని ప్రశ్నించారు. చీల్చడం సులభమే కానీ, అతకడమే కష్టమన్నారు. ఏదేమైనా తమ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
గూర్ఖాలాండ్ డిమాండ్ రేగడానికి యూపిఏనే కారణమన్నారు. ఆందోళన చేస్తున్న నేతలను కొందరు కేంద్రమంత్రులు ఢిల్లీకి పిలిపించి మాట్లాడటం ఇందుకు నిదర్శనమన్నారు. అయితే, తెలంగాణను గూర్ఖాలాండ్తో ముడిపెట్టరాదని పిసిసి అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య అన్నారు.
విలీనాన్ని స్వాగతిస్తాం: డిగ్గీ
కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ రాష్ట్ర సమితి విలీనాన్ని స్వాగతిస్తామని ఆ పార్టీ ఎపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గనక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. తమ పార్టీని కాంగ్రెస్లో ఆనందంగా కలుపుతామని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్లో కలిపేస్తే స్వాగతిస్తామని చెప్పారు.