వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రాద్రి టీదే: సోనియా, కెసిఆర్ బొమ్మలకు పెళ్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramreddy Venkat Reddy
ఖమ్మం/ అనంతపురం : ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో ఉన్న సీతారాముడు తెలంగాణవాడేనని ఖమ్మం జిల్లాకు చెందిన ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. భద్రాచలాన్ని ఆంధ్రా ప్రాంతంలో కలుపుతున్నారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.

శుక్రవారం పాలేరులో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాముడికి ప్రియ భక్తుడయిన భక్త రామదాసు పుట్టినగడ్డ నేలకొండపల్లి పాలేరు నియోజకవర్గంలోనే ఉందని తెలిపారు. జిల్లాలోని 46 మండలాలు తెలంగాణాలోనే ఉన్నాయని, భద్రాచలాన్ని వేరు చేయరాదని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందచేసినట్లు తెలిపారు.

ఇదిలావుంటే, రాష్ట్ర విభజనకు నిరసనగా అనంతపురం జిల్లా ఓడీచెరువులో సమైక్యవాదులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దిష్టిబొమ్మలకు వివాహం జరిపించారు.

ఆ తరువాత కెసిఆర్, సోనియా దిష్టిబొమ్మలను ఆటోపై కూర్చోబెట్టి పట్టణంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తర్వాత దిష్టిబొమ్మలకు కర్మకాండ నిర్వహించి నడి రోడ్డుపైనే దగ్ధం చేసి నోళ్లు బాదుకున్నారు. అక్కడే భోజనాలు చేశారు.

English summary
Minsiter from Khammam district Ramreddy Venkat Reddy said that Bhadrachalam seetharamudu belongs to Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X