అమ్మాయిపై వేధింపులు: జర్నలిస్టుపై నిర్భయ కేసు

వివరాలు ఇలా ఉన్నాయి - మేడ్చెల్ బి - ఫార్మాసి రెండో చదువుతున్న అమ్మాయిని గత మూడు నెలలుగా అతను వేధిస్తున్నాడు. శనివారం ఉదయం అతను కాలేజీ వద్దకు వచ్చి తన బైక్ మీద కూర్చోవాలని చెప్పాడు. ఆమె నిరాకరించడంతో మెడలోని బంగారం గొలుసును లాక్కుని పారిపోయాడు.
రెండు గంటల తర్వాత అతను షాపూర్లోని అమ్మాయి ఇంటికి వెళ్లాడు. పెట్రోల్ పోసి తగులబెడుతానని బెదిరించాడు. అయితే స్థానికులు గుమికూడి అతన్ని చితకబాదారు. దాంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. శనివారం రాత్రి అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు మేడ్చెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు శశాంక్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శశాంక్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications