ఎప్పుడింతే: కాంగ్రెస్పై బాబు, సిఎం దొంగలా..: తలసాని

వర్షాకాలంలోని విద్యుత్ సరిగా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రానికి చేనేత కోసం ఇద్దరు మంత్రులు ఉన్నా ఒరిగిందేమీ లేదన్నారు. కావూరి సాంబశివ రావు ఉన్నా ఉపయోగించుకోవడం లేదన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉందని, తాము అధికారంలోకి వస్తే చేనేత డిక్లరేషన్ అమలు చేస్తామని, ఆప్కోను పటిష్టం చేస్తామని చెప్పారు.
సిఎం దొంగలా...: తలసాని
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దొంగలా వారం రోజులుగా బయటకు రావడం లేదని మాజీ మంత్రి, టిడిపి హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ముగ్గురితో మాట్లాడి ఎనిమిది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అందరికీ సమన్యాయం చేస్తేనే కదా ఇరు ప్రాంతాలు కలిసి ఉండేది అన్నారు.
ఢిల్లీకి వెళ్తాం: విప్ పద్మరాజు
ఈ నెల 11వ తేదీన సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఢిల్లీకి వెళ్తామని శాసన మండలి విప్ పద్మరాజు అన్నారు. ఆంటోనీ కమిటీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతామన్నారు.
ఎమ్మెల్యే రాజీనామా
సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు రాజీనామా చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications