మాకే ఆ ధైర్యం: టిపై పిసి చాకో, కబడ్డీ ఆడిన నన్నపనేని

ఆంటోనీ కమిటీని స్వాగతిస్తున్నాం
తాము ఆంటోనీ కమిటీని స్వాగతిస్తున్నామని కాంగ్రెసు ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్, రాజయ్యలు అన్నారు. సీమాంధ్ర ప్రజలలో భయాందోళనలు తొలగించేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేశారన్నారు.
ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలి: కోదండ
తెలంగాణ ఉద్యమంలో కనిపిస్తే కాల్చివేస్తామన్న డిజిపి సమైక్య ఉద్యమాన్ని మాత్రం ముందుండి నడిపిస్తున్నారని టిజెఏసి చైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. సమైక్య ఉద్యమానికి ముఖ్యమంత్రి అండ ఉందన్నారు. ఈ నెల 10వ తేది నుండి శాంతి ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. వర్షాకాల సమావేశాల్లోని బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. హైకమాండ్ నిర్ణయాన్ని కిరణ్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అపోహలు వద్దు: డికె అరుణ
తెలంగాణ ఏర్పాటుపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి డికె అరుణ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. మేధావుల సూచనలతో సాగునీరు, విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపిస్తారన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలన్నారు.
సీమాంధ్రలో సమైక్య ఆందోళన
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి విశాఖలో సమైక్య ఆందోళనలో పాల్గొన్నారు. ఆమె కబడ్డీ ఆడి, నృత్యం చేసి, వంటా వార్పులో పాల్గొన్నారు. విభజనపై ప్రధానమంత్రి నోరు విప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
చిరు, కావూరి... కనిపించుట లేదు
సమైక్యాంధ్రకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావు, ఎంపీ కనుమూరి బాపిరాజులు కనబడటం లేదంటూ సమైక్యవాదులు వాల్ పోస్టర్లు అంటించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
పలమనేరులో సమైక్యవాదులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సోనియా గాంధీని యాచకురాలిగా, కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావులను ఆడవారి వేషంలో, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ బొమ్మను తయారు చేసి మద్యం సీసా వేలాడదీసి నిరసన తెలిపారు. కాగా ఎపి రెవెన్యూ ఉద్యోగుల సంఘం సిఎస్కు సమ్మె నోటీసు ఇచ్చింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని లేదంటే ఈ నెల 12వ తేది అర్ధరాత్రి నుండి సమ్మె చేస్తామని తెలిపింది.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??












Click it and Unblock the Notifications