సర్దార్ పటేల్ లేకుంటే హైదరాబాద్ పరిస్థితేంటి?: మోడీ
పటేల్ విగ్రహం ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. దేశాన్ని సమైక్యం చేసిన ఘనత ఆయనదే అన్నారు. అలాంటి వ్యక్తి అందరికీ ఆరాధ్యనీయుడన్నారు. చాణక్యుడి వంటి రాజనీతిజ్ఞత పటేల్లో ఉందన్నారు. దేశంలోని సంస్థానాల విలీన ప్రక్రియను నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ.. పటేల్కు అప్పగించారన్నారు.
అదే లేకుండా హైదరాబాద్ పరిస్థితి ఏమిటన్నారు. దేశంలోని అన్ని సంస్థానాల విలీన బాధ్యతను పటేల్కు అప్పగించిన నెహ్రూ.. జమ్మూ కాశ్మీర్ను మాత్రం తాను చూశారన్నారు. విలీనం చేయించడంలో నెహ్రూ విఫలం చెందడం వల్లనే ఇప్పటికీ అక్కడ సమస్య రగులుతోందన్నారు.
నాటి నుండి జమ్మూ వ్యాలీ సమస్యలో ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పటేల్ ఉంటే బాగుంటుందనిపిస్తోందన్నారు. జమ్మూ కాశ్మీర్లో పండిట్స్ ఇళ్లు వదిలి వీధులలో బతుకు ఈడుస్తున్నారన్నారు. ఇలాంటివి చూస్తున్నప్పుడు పటేల్ పదే పదే తనకు గుర్తుకు వస్తుంటారన్నారు.