తేల్చేసిన బొత్స: విభజనతో ఆంటోనీకి కమిటీకి నో లింక్

శుక్రవారం గాంధీభవన్లోని ఆయన ఛాంబర్లో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విభజన రాజ్యాంగ ప్రక్రియ అని, దానికీ ఆంటోని కమిటీకి సంబంధం లేదన్నారు. పార్టీకి సంబంధించిన శానససభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు తన అభిప్రాయాలను తెలిపేందుకు ఏ విధమైన గడువు లేదని బొత్స చెప్పారు. 14, 15వ తేదీల్లో కొంత మంది కేంద్ర మంత్రులు, ఎంపీలు ఆంటోని కమిటీని కలిసి విభజన సమస్యలపై వివరించినట్లు తెలిపారు.
19, 20 తేదీల్లో పార్టీకి చెందిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలను కమిటీకి తెలియజేసుకోవచ్చని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధిష్టానం తనను ఆదేశించిందని చెప్పారు. హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు ప్రత్యేకంగా కమిటీతో భేటీ కాదలిచామని మంత్రి నాగేంద్ర కోరారని తెలిపారు. ఏ జిల్లా వారైనా ప్రత్యేకంగా ఆంటోని కమిటీకి తమ అభిప్రాయాలు చెప్పదలచుకుంటే కమిటీ అనుమతి తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
విభజన నేపధ్యంలో హైదరాబాద్కు సంబంధించి, రాజధాని విషయం, నీటి సమస్యల గురించి వారి అభిప్రాయాలను కమిటీకి వివరించవచ్చునని అన్నారు. ఆంటోని కమిటీతో భేటీకి అనుమతి ఇప్పించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడిగారన్నారు. మీడియా సంయమనం పాటిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత అభిప్రాయాలు అజెండాగా పెట్టుకుని గతంలో తెలంగాణ ఉద్యమం ఎక్కువ చేసి చూపించారని, ఇప్పుడదే చేస్తున్నారన్నారు.
ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తాను ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మాట్లాడటం లేదని, వ్యక్తుల కంటే వ్యవస్థలు ముఖ్యమన్నారు. 30వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో అప్పటి వరకు ఆంటోని కమిటీకి చెందిన అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి నివాసంలో సీమాంధ్రకు చెందిన నేతలు సమావేశమవుతారని బొత్స సత్యనారాయణ చెప్పారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications