వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్తత, దెబ్బలు తినొద్దని అశోక్‌బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tension at Vidyut Soudha
హైదరాబాద్: విద్యుత్ సౌధ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇరు ప్రాంత ఉద్యోగాలు నిరసనలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగుల నిరసనలో తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు తదితరులు పాల్గొన్నారు.

సీమాంధ్ర ఉద్యోగులకు నిరసన తెలిపేందుకు విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ వచ్చారు. ఈ సమయంలో తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా, పరకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా సీమాంధ్ర ఉద్యోగులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

సమైక్యవాదుల దీక్షలో పాల్గొన్న పరకాల ప్రభాకర్ విభజన కుట్రను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోవద్దు: అశోక్ బాబు

సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోవద్దని సమైక్యాంధ్ర ఉద్యమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు అశోక్ బాబు సోమవారం శ్రీకాకుళంలో అన్నారు. సమైక్య ఉద్యమంలో పాలుపంచుకోని నాయకులకు గుర్తింపు లేదన్నారు. వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.

తాము శాంతియుతంగానే ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. సమైక్యాంధ్ర కోసం పార్టీ పెట్టే ఉద్దేశ్యం తమకు లేదని, ఎవరైనా పెడితే మద్దతిస్తామన్నారు. ఎస్మాలకు, భస్మాలకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు.

English summary
The face off between Seemandhra and Telangana employees in the government offices is continuing. Vidyut Soudha once again turned into a platform for the two sides to raise slogans for/against separate Telangana state on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X