వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పర్యటన చేపట్టనున్నారు. తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మీడియా సంపాదకులు, పార్టీ ముఖ్యులు, వివిధ సంఘాలతో నిర్వహిస్నున్న చంద్రబాబు ఎట్టకేలకు ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. సోమవారం ముఖ్య నేతలతో సమావేశమై తన యాత్రకు ఆత్మగౌరవ యాత్ర అని నామకరణం చేయాలని నిర్ణయించారు.ఈ యాత్రను తిరుపతి నుంచి చేపట్టాలని నిర్ణయించారు.

పార్టీ భవితవ్యం, మనుగడ, కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టడంతో పాటు 2014లో పార్టీని అధికారంలోకి తేవాలనే లక్ష్యాలతో ఈ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. చాలాకాలం పాటు కలిసి వున్న రాష్ట్రాన్ని విడదీయాలంటే ప్రభుత్వ పరంగా చేయాల్సిన కసరత్తు, లోటుపాట్లను చంద్రబాబు విశ్లేషించారు. దీంతో పాటు విభజన ఎలా జరగాలనే దానిపై కూడా అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా 60 ఏళ్ల పాటు కలిసి వున్న రాష్ట్రాన్ని విడదీయాలంటే ప్రభుత్వం తరపున ఒక కమిటీని వేయాల్సిన కనీస ఇంగిత జ్ఝానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించలేదని ఆయన విమర్శించారు.

తమ పార్టీ విభజనకు ఏ మాత్రం వ్యతిరేకం కాదని చెబుతూనే, విభజన తీరును తప్పు పడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కసరత్తును ముమ్మరం చేశారు. ఇరు ప్రాంతాల్లో నెలకొన్న బలమైన సెంటిమెంట్లను ఉపయోగించుకుని కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తూనే తమ పార్టీని అంతమొందించాలని కుట్ర పన్నుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రజలకు వివరించనున్నారు.

తెలంగాణ అటు సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ వారిని బాసటగా నిలిచేందుకు ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రజలకు వివరించనున్నారు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకుని వచ్చే ఎన్నికలకు సంసిద్ధం చేయాలనే ఆలోచన ఈ యాత్రలో ఇమిడి ఉంది. కాంగ్రెస్‌ విభజన పక్రియను ప్రకటించినప్పుడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను తెలియజేస్తే వారి భాగస్వామ్యంతో ప్రకటించి వుంటే చాలా మంచి అభిప్రాయం వుండేదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు.

English summary
Telugudesam party presidnt Nara Chandrababu naidu has decided to takup state tour on the name of telugu pride. He wants to begin his yatra from Tirupathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X