సోనియా వెనక్కి తగ్గరు, సమైక్యం ఇష్టం లేదు: టీపై జెసి

JC Diwakar Reddy
అనంతపురం/ విజయవాడ/ హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఆలోచన సోనియాకు లేదని రాయలసీమకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. గుడికన్నా మెల్లె మేలనే ఉద్దేశంతో రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చామని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే రెండు ప్రాంతాల్లో తాగు, సాగు నీటి యుద్దాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

తాను అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఆరుసార్లు పోటీ చేసి గెలిచానని, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తే డిపాజిట్ కూడా దక్కదని దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విడగొడితే రెండు ప్రాంతాల మధ్య నీటి యుద్ధాలు తప్పవని అన్నారు. ట్రిబ్యునల్ తీర్పులను కూడా రాష్ట్రాలు అమలు చేయడం లేదని ఆయన అన్నారు.

రాజయకీయ నాయకులను నమ్మవద్దని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ సూచించారు. శనివారం ఉదయం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తమకు హైదరాబాద్ ముఖ్యం కాదని, రైతుల సంక్షేమమే ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సంక్షోభంలోకి లాగింది రాజకీయ పక్షాలే అని ఆయన ఆరోపించారు. నిర్ణయం మార్చుకోవాలని కాంగ్రెసు అధిష్టానంతో పోరాడుతున్నామని బుద్ధ ప్రసాద్ తెలిపారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెసు పార్టీ నాటకాలు ఆడుతోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. తమ పార్టీ అగ్రనేత సుష్మా స్వరాజ్‌ను విస్మరించే నైతికత కాంగ్రెసు పార్టీకి ఎక్కడిదని ఆయన శనివారం హైదరాబాదులో ప్రశ్నించారు. బిజెపి మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని ఆయన అనన్నారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అసలు లేదని, ఇక ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి ఎలా వస్తుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+