వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజనకు నిరసన: జైలులో వైయస్ జగన్ నిరాహార దీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో నిరవధిక నిరాహార దీక్షను చేపట్టనున్నారు. ఈ మేరకు శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది. తన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దీక్షను గుంటూరులో పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.

వైయస్ జగన్ దీక్ష చేస్తానని చెప్పారని, అయితే తాము వద్దన్నామని, దీక్ష చేస్తే జగన్‌ను వేరే రాష్ట్రంలోని జైలుకు పంపించే ప్రమాదం ఉందని వద్దన్నామని విజయమ్మ తన దీక్షను ప్రారంభించిన రోజు చెప్పిన విషయం తెలిసిందే. విజయమ్మ దీక్ష భగ్నం నేపథ్యంలో తాను దీక్ష చేయాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి జగన్ దీక్ష చేస్తారని ఆయన భార్య భారతి చెప్పారు. జగన్‌ను శనివారం భారతితో పాటు పార్టీ ముఖ్య నేతలు కలిశారు. వారితో జగన్ తాను దీక్ష చేపట్టబోయే విషయంపై చర్చించారు.

అన్ని ప్రాంతాలవారికి సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథ స్థితిలో ఉంచాలని వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అదే వైఖరితో సీమాంధ్రలో తన ఉద్యమాన్ని సాగిస్తోంది. కాగా, గుంటూరు ఆస్పత్రిలో వైయస్ విజయమ్మ జగన్ విజ్ఝప్తితో విరమించారు.

అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ అరెస్టయి హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు. కాంగ్రెసు అధిష్టానం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి పూనుకుందని వైయస్ జగన్ విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
YSR Congress party president YS Jagan has prepared to begin fast in Chanchalguda jail in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X