ముంబై గ్యాంగ్ రేప్ కేసు: రెండో నిందితుడి అరెస్టు
ముంబై: మహిళా ఫొటో జర్నలిస్టు సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు రెండో నిందితుడిని అరెస్టు చేశారు. మధ్య ముంబైలోని మదన్పూర్లో విజయ్ జాదవ్ అనే రెండో నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేసారు. శుక్రవారం ఓ నిందితుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మరో ముగ్గురిని పోలీసులు ఇంకా పట్టుకోవాల్సి ఉంది. నేరం జరిగిన 24 గంటల లోపల ఓ నిందితుడిని పట్టుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని గుర్తించారు. మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యచారం జరిగిన కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరుగుతుందని నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు.

నిందితులను పట్టుకోవడానికి క్రైమ్ బ్రాంచ్ 20 పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు సింగ్ చెప్పారు. అసైన్మెంట్పై శక్తి మిల్స్ ఆవరణకు వెళ్లిన 22 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్టుపై గురువారం సాయంత్రం ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపారు.
ఫొటో జర్నలిస్టు మగ సహోద్యోగిని ఆ ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ప్రస్తుతం జస్లోక్ అస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. తనపై అత్యాచారం జరిపిన నిందితులకు జీవిత ఖైదు పడాలని ఆమె కోరుకుంటోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications