వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరిది శవం పక్కనుండగా పోలీసుపై దొంగల గ్యాంగ్ రేప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Robbers rape Jharkhand cop
రాంచీ: చనిపోయిన తన మరిది మృతదేహాన్ని తీసుకు వెళ్తుండగా దొంగలు ఓ మహిళా కానిస్టేబుల్ పైన సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని లాతేహార్‌లో ఓ మహిళా పోలీసు అర్ధరాత్రి వేళ జాతీయ రహదారిపై వెళ్తుండగా ముంబైలో ఢిల్లీ పునరావృతమైన గురువారం నాడే ఈ మహిళా కానిస్టేబుల్ సామూహిక అత్యాచారానికి గురైంది.

ఆమె ఫిర్యాదు ప్రకారం తన మరిది మృతదేహానికి గఢ్వాలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇద్దరు చెల్లెళ్లతో కలసి రాంచీ నుంచి కారులో బయల్దేరారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జగల్దాగా వద్ద జాతీయ రహదారిపై పలు వాహనాలను దోచుకున్న కొందరు దొంగలు వీరి కారునూ అడ్డగించారు. అనంతరం ఆమెను పక్కకు ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

కారులో మరిది మృతదేహం ఉందని చెప్పినా దుండగులు వినిపించుకోలేదు. కారులో ఆమెతో పాటు సోదరీలు ఉండగా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బాధితురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పోలీసు అయిన తన భర్త మావోయిస్టుల దాడిలో మరణించడంతో తనకు ఆ ఉద్యోగం ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ శనివారం విలేకరులకు తెలిపారు.

English summary

 A tribal policewoman in her 20s was gang raped by armed robbers on NH 75 on the outskirts of Latehar, 180 km from Ranchi, when she was accompanying her family members to carry her younger sister’s body from Ranchi to Garhwa for burial on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X