ఉరేసుకునేదాన్ని: నన్నపనేని, సీమాంధ్రులకు పువ్వులు
అశోక్ ఖబర్దార్!: జూపల్లి హెచ్చరిక
అశోక్ బాబూ.. రెచ్చగొట్టేలా మాట్లాడితే ఖబడ్దార్! అని ఎపిఎన్జీవో అధ్యక్షుడిని తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు వేరుగా హెచ్చరించారు. సుదీర్ఘ కాలం ఇక్కడే ఉండాలనుకుంటే సరిగా మాట్లాడాలని, లేకపోతే తెలంగాణ సమాజం ఒప్పుకోదని తేల్చిచెప్పారు. తెలంగాణవాళ్లు 3.5 కోట్లమంది ఉంటే, సీమాంధ్రులు ఐదుకోట్ల మంది అనడంలో అర్థమేమిటని ప్రశ్నించారు.
హైదరాబాద్లో ఉండేవాళ్లు రెచ్చగొడితే ఎవరికి నష్టం? నగరం పై ముమ్మాటికీ తెలంగాణదే హక్కు అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా హైదరాబాద్ను సాధించలేరన్నారు. హైదరాబాద్ తమదని, ఇక్కడ శాంతిర్యాలీ నిర్వహిస్తుంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సమైక్యాంధ్ర జెఏసి నేతల్లా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేశ్ రెడ్డిలను తెలంగాణ మంత్రులు నిలదీయాలని కోరారు.
సీమాంధ్రులకు పువ్వులు
అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయులుగా కలిసుందామని కోరుతూ హైదరాబాదు నుండి గుంటూరు వెళ్తున్న గోల్కొండ ఎక్సుప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సీమాంధ్ర వారికి వరంగల్ జిల్లా జనమగామలో స్థానికులు పువ్వులు ఇచ్చి పలకరించారు. తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ సద్భావన యాత్రలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.