ఫ్లడ్స్: నటి చేతులమీదుగా ఇన్క్రెడిబుల్ చెక్కు(పిక్చర్స్)
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకునేందుకు ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో రతన్ టాటా ట్రస్ట్ నేతృత్వంలోని హిమోతన్ సొసైటీకి కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, టాలీవుడ్ నటి మాధవీలత, విస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ రీత్ సాహు, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్ సుధాకర్లు రూ.3,25,000 చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా వారు ఇన్క్రెడిబుల్ సంస్థ దాతృత్వాన్ని అభినందించారు. కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సంస్థ విభిన్న రకాల, సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా వార్షికోత్సవ వేడుకకు నిధులు వృధా చేయకుండా.. ఓ మంచి పనికి వీటిని ఉపయోగించడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు.
భవిష్యత్తులో కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ అవసరమైనా తమ సంస్థ తమ వంతు సహకారాన్ని అందిస్తుందని సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఓఓ, డైరెక్టర్ విజయ్ కుమార్, హెడ్ ఆపరేషన్స్ నమ్రితా దింగ్రా పాల్గొన్నారు.
చెక్కు 1
రతన్ టాటా ట్రస్ట్ నేతృత్వంలోని హిమోతన్ సొసైటికి కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, టాలీవుడ్ నటి మాధవీలత తదితరుల చేతుల మీదుగా రూ.3,25,000ల చెక్కును అందజేస్తున్న ఈన్క్రెడిబుల్ ఇండియా.
చెక్కు 2
రతన్ టాటా ట్రస్ట్ నేతృత్వంలోని హిమోతన్ సొసైటికి కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, టాలీవుడ్ నటి మాధవీలత తదితరుల చేతుల మీదుగా ఇచ్చిన రూ.3,25,000ల చెక్కు.
జ్వోతి ప్రజ్వలన
ఉత్తరాఖండ్ బాధితులకు ఇన్క్రెడిబుల్ ఇండియా సంస్థ చెక్కును ఇచ్చిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వల చేస్తున్న నటుడు సుధాకర్ కొమకుల.
మాధవీలత 1
ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ తెలుగు నటి మాధవీలత. అక్కడ నటి ఫోటో షూట్ దృశ్యం.
మాధవీలత 2
ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ తెలుగు నటి మాధవీలత. అక్కడ నటి ఫోటో షూట్ దృశ్యం.
మాధవీలత 3
ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ తెలుగు నటి మాధవీలత. అక్కడ నటి ఫోటో షూట్ దృశ్యం.
ఫోటో షూట్ 1
ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం చెక్ అందచేసింది. కార్యక్రమంలో పాల్గొన్న రీత్ సాహు
ఫోటో షూట్ 2
ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం చెక్ అందచేసింది. కార్యక్రమంలో పాల్గొన్న రీత్ సాహు