హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారుల ప్రజా దర్బార్, విశాలాంధ్ర ఉద్రిక్తం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో గురువారం ముప్పయ్యొవ రోజు నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, దుకాణాలు మూతపడ్డాయి.

ప్రభుత్వ, ప్రయివేటు, వ్యాపార సంస్థల వారు స్వచ్చంధంగా ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. సమైక్యాంధ్ర కోసం నిరసనల నేపథ్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర కోసం ప్రత్యేకంగా పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. గుంటూరులో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని సమైక్యవాదులు గురువారం ముట్టడించారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాదులోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇరు ప్రాంత ఉద్యోగులు పోటా పోటీగా నినాదాలు చేస్తున్నారు. బుధవారం సచివాలయం, విద్యుత్ సౌధ తదితర కొన్ని కార్యాలయాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. సమైక్యవాదులు విభజనను వ్యతిరేకిస్తూ, తెలంగాణవాదులు బిల్లు పెట్టాలని వినూత్న నిరసనలు తెలుపుతున్నారు.

విద్యుత్ సౌధ వద్ద సమైక్యం

విద్యుత్ సౌధ వద్ద సమైక్యం

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని విద్యుత్ సౌధ వద్ద విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు. జై సమైక్యాంధ్ర అంటూ వారు నినాదాలు చేశారు.

విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ

విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ

హైదరాబాదులోని విద్యుత్ సౌధ వద్ద ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. పలు ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం కూడా ఉద్రిక్తంగా మారాయి.

దిష్టిబొమ్మ దగ్ధం

దిష్టిబొమ్మ దగ్ధం

ప్రకాశం జిల్లా ఒంగోలులో సిడబ్ల్యూసి రాష్ట్ర విభజన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యం.

చిన్నారుల ప్రజా దర్భార్

చిన్నారుల ప్రజా దర్భార్

విభజనను నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో చిన్నారులతో ప్రజా దర్భార్ నిర్వహించారు. న్యాయమూర్తులుగా, లాయర్లుగా చిన్నారులు అలరించారు.

కృష్ణుడి వేషధారణలో..

కృష్ణుడి వేషధారణలో..

చిత్తూరు జిల్లా తిరుపతిలో బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి వేషధారణలో సమైక్యాంధ్ర కోరుతూ నిరసన తెలుపుతున్న దృశ్యం.

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

తిరుపతిలో ఎస్‌విపిసెట్ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మానవహారం నిర్వహించిన మహిళా ఉద్యోగులు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

విశాలాంధ్ర 1

విశాలాంధ్ర 1

హైదరాబాదులోని సోమాజిగుడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ దృశ్యం.

విశాలాంధ్ర 2

విశాలాంధ్ర 2

హైదరాబాదులోని సోమాజిగుడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో తెలంగాణ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్న దృశ్యం.

విశాలాంధ్ర 3

విశాలాంధ్ర 3

హైదరాబాదులోని సోమాజిగుడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. విశాలాంధ్ర మహాసభ నాయకులతో తెలంగాణ జర్నలిస్టుల వాగ్వాదం.

విశాలాంధ్ర 4

విశాలాంధ్ర 4

హైదరాబాదులోని సోమాజిగుడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ అర్ధాంతరంగా ముగిసిపోవడంతో వెళ్తున్న నాయకులు.

English summary
Protests continued across Seemandhra and Hyderabad on Thursday against the proposed division of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X