జైల్లో దీక్ష: మరింత క్షీణించిన జగన్ ఆరోగ్యం

ఆహారం తీసుకోకుంటే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వైద్యులు చెప్పారు. బిపి కూడా పడిపోయింది. వైయస్ జగన్ ఆరోగ్యంపై గంట గంటకు జైళ్ల డిజిపికి చంచల్గుడా జైలు అధికారులు నివేదికలు పంపిస్తున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర హోం శాఖ అధికారులకు జైలు అధికారులు నివేదికను పంపించారు.
జగన్ రక్తంలో గ్లూకోజ్ కూడా పడిపోయింది. దీక్ష విరమించాలని జైలు అధికారులు సూచిస్తున్నప్పటికీ జగన్ వినడం లేదు. ఆయనకు బలవంతంగా ఆహారం అందించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం కనిపించలేదు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తూ చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జైలులోనే ఆయనకు తగిన చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
జగన్ మద్దతుదారులు గురువారంనాడు జైలు బయట ప్రదర్శన నిర్వహించారు. ఆయనకు మద్దతు తెలపడానికి వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను, మద్దతుదారులను పోలీసులు ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుని వెనక్కి పంపిస్తున్నారు. కాగా, సీమాంధ్ర న్యాయవాదులు గురువారంనాడు జైలు వద్దకు వచ్చారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి జగన్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేయాలని వారు జైలు అధికారులను కోరారు. ఈ మేరకు వారు జైలు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications