ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు: మైనర్ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో మైనర్ నిందితుడు దోషిగా తేలాడు. అత్యాచారం, హత్య అభియోగాల్లో అతన్ని కోర్టు దోషిగా తేల్చింది. వైద్య విద్యార్థినిపై కదులుతున్న బస్సులో అత్యాచారానికి పాల్పడిన ఆరుగురిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అతనిపై కేసును బాలనేరస్థుల కోర్టు విచారించింది.
మూడేళ్ల పాటు అతన్ని రిఫార్మ్ సెంటర్కు పంపుతూ కోర్టు తీర్పు వెలువరించింది. నేరం జరిగినప్పుడు అతనికి 17 ఏళ్లున్నాయి. దాంతో మిగతా నిందితుల నుంచి అతన్ని వేరు చేసి జువెనైల్ కోర్టు విచారణ జరిపింది.
నిరుడు డిసెంబర్ 16వ తేదీన ఓ వైద్య విద్యార్థినిపై బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసులోని ఆరుగురు నిందితుల్లో మైనర్ నిందితుడిపై బాలనేరస్థుల కోర్టు శనివారం తీర్పు వెలువరించింది.
వైద్య విద్యార్థిని తన మగ మిత్రుడితో కలిసి వెళ్తుండగా అత్యాచారానికి గురైంది. మిత్రుడిని తీవ్రంగా కొట్టి ఆరుగురు వ్యక్తులు ఆమెపై బస్సులోనే అత్యాచారానికి పాల్పడ్డారు.