ముంబై రేప్: ముగ్గురు నిందితులు పోర్న్ చూసేవారు
ముంబై: మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు తరుచుగా అక్రమ వీడియో పార్లర్స్లో అశ్లీల చిత్రాలు చూసేవారని తెలుస్తోంది. మదన్పురా, బైకుల్లా, అగ్రిపదల్లోని రెడ్ లైట్ ఏరియాకు కూడా వెళ్తుండేవారని పోలీసులు చెబుతున్నారు.
తాము పోర్న్ చూసేందుకు వెళ్తుండేవాళ్లమని నిందితులు విజయ్ జాదవ్, కాసిం బెంగాలీ, మైనర్ తమకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిజానికి విజయ్ జాదవ్ పార్లర్లో నిద్రిస్తూ పోలీసులకు చిక్కాడు. ముంబైలోని మురికివాడల్లో ఈ అశ్లీల చిత్రాల ప్రదర్శన ఏ విధంగా జరుగుతోందో ఈ సంఘటన ద్వారా వెల్లవడవుతోందని అంటున్నారు.

అగ్రిపదలో దాదాపు నాలుగు డజన్ల అక్రమ పార్లర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రోజుకు ఎనిమిది నుంచి పది చిత్రాలను వేస్తారని అంటున్నారు. దాదాపు 50 నుంచి 80 మంది కూర్చుని వాటిని చూడడానికి వీలుంటుందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక్కో వ్యక్తి నుంచి 15 నుంచి 20 రూపాయల వరకు వసూల చేస్తారని ఆ వార్తలను బట్టి తెలుస్తోంది.
నిర్మానుష్య ప్రదేశాలను గుర్తించి, తగిన భద్రత ఉండేలా చూడాలని పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ గతవారం ఆదేశాలు జారీ చేశారు. ఖాళీగా ఉన్న ప్రదేశాలకు సంబంధించి వాటి యజమానులకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. డెన్లపై దాడులు చేసిన 55 మంది డ్రగ్స్కు అలవాటుపడినవారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications