బొత్సకు విద్యార్థుల నిలదీత: సమైక్యవాదినే కానీ..

విజయనగరంలో జరిగిన దాడికి బొత్స క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. బొత్స మాత్రం తనకు తెలియదని, విషయం తెలుసుకున్న తర్వాత స్పందిస్తానన్నారు. అయినా వారు పట్టు వీడకపోవడంతో దాడి జరిగితే మాత్రం ఖండిస్తున్నట్లు చెప్పారు.
సమైక్యవాదినే కానీ..
సీమాంధ్ర ప్రజల మనోభావాల నేపథ్యంలో తాను సమైక్యవాదినేనని అయితే, తమ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను తాను అధిష్టానానికి చెబుతానని, అంతిమంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అభిప్రాయపడ్డారు. విభజనపై తాను రెండు మాటలు మాట్లాడటం లేదన్నారు.
మరోవైపు విజయనగరంలో విద్యార్థులపై జరిగిన దాడిని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. సమైక్యాంధ్రలో పాల్గొన్న విద్యార్థులపై విజయనగరంలో జరిగిన దాడిని నిరసిస్తూ మయూరి ఫంక్షన్ హాల్ వద్ద విద్యార్థులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు.












Click it and Unblock the Notifications