కేంద్రాన్ని కూలుద్దాం, రండి: విభజనపై పయ్యావుల

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం శాసనసభకు వస్తుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ రెండు సార్లు చెప్పారని, అందువల్ల శాసనసభలో తీర్మానాన్ని ఓడించడానికి సీమాంధ్ర శాసనసభ్యులు ఒక్కటి కావాలని ఆయన అన్నారు.
ఎపిఎన్జీవోలు ఈ నెల 7వ తేదీన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సమైక్యాంధ్ర సభకు వెళ్దామని కూడా సూచించారు. ఏ చట్టాలు, నిబంధనలు కూడా తమను సభకు వెళ్లకుండా అడ్డుకోలేవని ఆయన అన్నారు. కేంద్రం మోసంలో చిక్కుకోకుండా ప్రజల పక్షాన నిలుద్దామని ఆయన సీమాంధ్ర ప్రజాప్రతినిధులను కోరారు.
ముఖ్యమంత్రి లేరు..
సమైక్యాంధ్ర ఉద్యమం వెనక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని అనడం నిజం కాదని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని చూసి కేంద్రం ఆలోచనలో పడిందని ఆయన గురువారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ అంశం అసెంబ్లీలో తీర్మానానికి వచ్చినప్పుడు సీమాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని తాము తెలియజేస్తామని పితాని చెప్పారు. ఎపి ఎన్జీవోల సభను అడ్డుకుంటామని తెలంగాణవాదులు అనడం సమంజసం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications