దాని వెనుక కిరణ్ లేరు: పితాని, జగన్ పార్టీపై రేవంత్
కాంగ్రెస్ చేతిలో జగన్ పార్టీ పగ్గాలు: రేవంత్
కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పగ్గాలు ఉన్నాయని, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు ఆ పార్టీ ఆడుతోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సిడబ్ల్యూసి నిర్ణయానికి ముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామా చేయించిందని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర కోసం హోంమంత్రికి ఆ పార్టీ లేఖ రాయాలని కాంగ్రెస్ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారముందని, ఒకట్రెండు రోజుల్లో ఆ పార్టీ లేఖ రాయనుందని ఆయన అన్నారు. ఇది వాస్తవమా...కాదా చెప్పాలని ప్రశ్నించారు.
శాంతిర్యాలీ నిర్వహించి తీరుతాం: కోదండరామ్
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈనెల 7న హైదరాబాద్లో శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. ప్రభుత్వమే సీమాంధ్రలో ఉద్యమాన్ని చేయిస్తోందని ఆయన మండిపడ్డారు.