వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటి భోజనానికి అనుమతించండి: జగన్, కోర్టు ఓకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: చంచల్ గూడ జైలులో తాను ఇంటి భోజనం తీసుకునేందుకు అనుమతించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేశారు. మెమో స్వీకరించిన కోర్టు జగన్‌కు ఇంటి భోజనానికి అనుమతించింది.

ఇటీవల సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ జైలులోనే దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఆయన దీక్షను ఐదు రోజుల తర్వాత భగ్నం చేశారు. నిమ్స్‌లో ఆయనకు చికిత్స నిర్వహించారు. ఫ్లూయిడ్స్ ఎక్కించారు. జగన్ కోలుకున్నాక చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఈ నేపథ్యంలో నాలుగు వారాల పాటు ఇంటి భోజనం తీసుకోవాలని నిమ్స్ వైద్యులు జగన్‌కు సూచించారు. దీంతో జగన్ తనకు ఇంటి భోజనం తినేందుకు అనుమతించాలని ఈ రోజు కోర్టులో మెమో దాఖలు చేశారు. కాగా, జగన్‌కు ములాఖత్‌లకు అనుమతిస్తున్నారు.

మరోవైపు, జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మరో ఛార్జీషీటును దాఖలు చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే సిబిఐ డైరెక్టర్ అనుమతిని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆస్తుల కేసులో ఇటీవలే మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి గీతా రెడ్డిలు సిబిఐ అధికారులు విచారించారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy has filed a memo in CBI special court for home food into Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X