అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో 1445 కరోనా కేసులు: 11 మంది మృతి

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,445 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. తాజాగా 1,243 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్‌ బారినపడి మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,33,419కి చేరింది. ఇప్పటివరకు 20,04,786 మంది కరోనావైరస్ నుంచి కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 14,030 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,603 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.

JusticeForChaithra: దారుణ హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ (ఫొటోస్)JusticeForChaithra: దారుణ హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ (ఫొటోస్)

గత 24 గంటల్లో 62,252 టెస్టులు నిర్వహించగా.. 1445 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కరోనా వైరస్ సోకి కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, కర్నూల్‌, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 271 మంది, చిత్తూరులో 201, కృష్ణాలో 164, గుంటూరులో 141, ప్రకాశంలో 136, పశ్చిమ గోదావరిలో 131, కడపలో 131, నెల్లూరులో 130 మందికి పాజిటివ్‌ వచ్చింది

1445 people infected corona in andhra pradesh

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Hansika Motwani: సన్యాసులను సైతం నిద్ర పోకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.. బికినీతో అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ...(ఫొటోస్)Hansika Motwani: సన్యాసులను సైతం నిద్ర పోకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.. బికినీతో అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ...(ఫొటోస్)

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

English summary
last 24 hours 1445 people infect corona in andhra pradesh state. 11 people died due to corona virus health officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X