అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో మరింత తగ్గుముఖం: 1540 కేసులు.. 19 మంది మృతి

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో కూడా తక్కువ కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో 1540 మందికి కరోనా సోకింది. 19 మంది మృతిచెందారని హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొంది వెల్లడించింది. నిన్న 1627 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్నటి కన్నా తక్కువ కేసులు నమోదు అయ్యాయి.

గత 24 గంటల్లో 61 వేల 298 మంది నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల 965 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా సోకిన వారు ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు చనిపోయారు. మిగతా జిల్లాల్లో 10 మంది చనిపోయారు.

1540 people infected corona in andhra pradesh

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

English summary
last 24 hours 1540 people infect corona in andhra pradesh and 19 people died due to virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X