ఏపీలో నిన్నటికన్నా కాస్త పెరిగిన కరోనా.. అయినా కేసులు తక్కువే.. ఇద్దరు మృతి
కరోనా తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా కేసుల ప్రభావం తగ్గింది. దాదాపు అందరూ సెకండ్ డోసు వేసుకోవడం.. కొందరు బూస్టర్ డోసు వేసుకోవడంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో ఏపీ ప్రభుత్వం నిబంధనలు, ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు.
గత 24 గంటల్లో 18 వేల 915 కరోనా పరీక్షలు చేశారు. 496 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో 3,30,66,774 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14 వేల 722కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,464 చేరుకుంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,98,033గా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 4 వేల 709గా ఉంది.

అనంతపురం 44. చిత్తూరు 16. ఈస్ట్ గోదావరి 44. గుంటూరు 28. వైఎస్ఆర్ కడప 08. కృష్ణా 18. కర్నూలు 01. నెల్లూరు 08. ప్రకాశం 40. శ్రీకాకుళం 0. విశాఖపట్టణం 34. విజయనగరం 01. వెస్ట్ గోదావరి 38 మందికి కరోనా సోకింది. ఇక దేశం విషయానికి వస్తే.. రోజువారి కేసులు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 13 వేల 166 పాజిటివ్ కేసులు వచ్చాయి. వైరస్ బారిన పడి కొత్తగా 302 మంది చనిపోయారు. కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 13 వేల 226కి చేరింది. 26 వేల 988 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 4 కోట్ల 22 లక్షల 4 వేల 884కి చేరింది. పాజిటివ్ రేటు 1.28గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 34 వేల 235గా ఉంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications