ఏపీలో 878 కరోనా కేసులు: 13 మంది మృతి
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 41,173 శాంపిల్స్ టెస్ట్ చేశారు. వీరిలో 878 మందికి వైరస్ సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,01,3001కి చేరింది. కొత్తగా 13 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,838కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,182 మంది వైరస్ కారణంగా కోలుకున్నారు. కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1984301కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,862 యాక్టివ్ కేసులున్నాయి.
ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 2,65,76,995 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూర్ జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క రు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో ప్రమాదకరంగా 255 కొత్త కేసులు వెలుగుచూశాయి.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications