ఉపాధ్యాయుల కోసం లోగో ఆమోదించిన ఎపి ప్రభుత్వం...శాంసంగ్ చే స్మార్ట్ క్లాసుల నిర్వహణ
అమరావతి:ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక లోగోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. డిసెంబరు 1 తేదీ నుంచి ఈ లోగో అమల్లోకి రానున్నట్లు తెలిసింది.
తద్వారా న్యాయవాదులు, వైద్యుల తరహాలో ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఈ లోగోను తమ లెటర్ హెడ్లపై, వాహనాలపై వినియోగించుకోవచ్చునని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్యూఎస్) తెలిపింది. టీఎన్యూఎస్ తరుపున విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆ యూనియన్ ప్రతినిథులు ఆర్.రాంబాబు, పీవీఎస్ వర్మ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఉపాధ్యాయుల కోసం గతంలో తాము ఒక లోగో రూపొందించినప్పటికీ దానికి ప్రభుత్వ ఆమోదం లభించలేదని, అయితే ప్రస్తుతం రూపొందించిన లోగోకు ప్రభుత్వం తన అంగీకారం తెలియజేసిందని టీఎన్యూఎస్ ప్రతినిధులు తెలిపారు. తమ ప్రయత్నాన్ని గుర్తించి ఉపాధ్యాయులకు సముచిత గౌరవాన్ని కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖకు కృతజ్జతలు తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు.
మరోవైపు ఎపి ప్రభుత్వం తలపెట్టిన 'టీచర్స్ టీచింగ్ ఫర్ టెక్నాలజీ' కార్యక్రమంలో భాగంగా ఏపీలోని 14 కాలేజీల్లో కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ స్మార్ట్ క్లాస్లు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఎపి విద్యాశాఖ పర్యవేక్షణలో జరగనున్న ఈ స్మార్ట్ క్లాస్ ల శిక్షణ ద్వారా ఔత్సాహిక అభ్యర్థులకు బీఎడ్, డీఎడ్ డిగ్రీలను అందించనున్నట్లు సమాచారం. 200 గంటలపాటు ఈ కోర్సులు అందించనున్నట్లు తెలిసింది.
ఈ కోర్సుల ద్వారా అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో స్మార్ట్ క్లాస్ రూమ్ ల ద్వారా శిక్షణ ఇచ్చే పాఠశాలలకు ఈ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉపయోగపడతారు. అలాగే ముందు ముందు బోధనా వ్యవస్థ అధునాతన డిజిటల్ మాధ్యమాల్లో సాగనున్నందున అలాంటి విద్యను అందించేందుకు ఈ కోర్సు చేసిన అభ్యర్థులు అవసరం. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ ఈ కోర్సు వివరాలతో కూడిన ఒక ప్రకటనను సోమవారం విడుదల చేశారు. యునెస్కో-ఎంజీఐఈపీల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications