డిసెంబర్ 24 నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు.. కొత్త షెడ్యూల్ రిలీజ్
అమరావతి : ఏపీ డీఎస్సీ పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో కొత్త షెడ్యూల్ విడుదలయింది. డిసెంబర్ 24 నుంచి పరీక్షలు మొదలుకానున్నాయి. తొలుత షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 6 నుంచి డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ప్రకటనకు, పరీక్షలకు మధ్య సమయం తక్కువుందన్న అభ్యర్థుల వినతి మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అదలావుంటే డీఎస్సీ పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు.
కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగే తేదీలు, వివరాలు :

2. స్కూల్ అసిస్టెంట్ (భాషేతర) పరీక్షలు : డిసెంబరు 24, 26, 27
3. స్కూల్ అసిస్టెంట్ (భాషలు) పరీక్షలు : డిసెంబరు 28న
4. పోస్టుగ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ పరీక్షలు: డిసెంబరు 29న
5. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ, వ్యాయామ(పీఈటీ) పరీక్షలు : డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు
6. ప్రిన్సిపళ్లు, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్ పరీక్షలు : జనవరి 2న
7. భాషాపండితులకు సంబంధించిన పరీక్షలు : జనవరి 3న
8. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ (ఎస్జీటీ) పరీక్షలు : జనవరి 18 నుంచి 30వరకు
వాస్తవానికి డిసెంబర్ 6న జరగాల్సిన పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేశారు. అయితే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాత్రం సమయం పొడిగించలేదు.












Click it and Unblock the Notifications