అమరావతిలో కేంద్రం కీలక నిర్ణయం - తాజాగా..!!
ఏపీ రాజధాని విషయంలో న్యాయ- రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఇదే సమయంలో అమరావతిలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్ల నడుమ ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇదే సమయంలో కేంద్రం తాజాగా అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తక్షణ నిధులను మంజూరు చేసింది. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది.
రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన వివాదం కొనసాగుతోంది. మూడు రాజధానుల్లో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ స్థానిక రైతులు, జేఏసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ కు వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ దశలో ఉంది. ఇదే సమయంలో అమరావతిలో కేంద్ర నిర్మాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

అమరావతిలో నిర్మించతలపెట్టిన కేంద్రీయ సచివాలయం అంచనా వ్యయాన్ని రూ.1,500 కోట్లకు పెంచింది. తక్షణమే రూ. కోటి కేటాయించింది. గతేడాది ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,244.19 కోట్లుగా ఉంది. 2023-24 బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులను ఆయా అవసరాల కోసం కేటాయిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమగ్ర పద్దుల వివరాలను విడుదల చేసింది.
అమరావతి పరిధిలోని రాయపూడిలో కేంద్రీయ సచివాలయం భవన నిర్మాణానికి ప్రత్యేక హెడ్ను సృష్టించింది. రూ.1,500 కోట్ల అంచనా వ్య యంతో నిర్మిస్తున్న ఈ భవనానికి 2023-24లో రూ.కోటి కేటాయిస్తున్నట్లు పేర్కొంది. దీంతో పాటుగా విశాఖ కేంద్రంగా సాగుతున్న నిర్మాణాలకు కేంద్రం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
రూ.46.76 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ డాబాగార్డెన్స్లో ఆదాయపు పన్ను శాఖ నూతన భవన నిర్మాణానికి, రూ.18.17 కోట్ల వ్యయంతో విశాఖలో కేంద్ర జీఎస్టీ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి రూ. కోటి చొప్పున, విశాఖలో రూ.10 కోట్ల వ్యయంతో జనరల్ పూల్ ఆఫీస్ అకామడేషన్ (జీపీఏవో) నిర్మాణానికి రూ.50 లక్షలు, అందుకు రూ.5 కోట్లతో భూమి కొనుగోలుకు రూ.లక్ష కేటాయించింది. ఇప్పటికే ఏపీ రాజధాని వివాదానికి సంబంధించి సుప్రీం సూచనల మేరకు కేంద్రం తన వాదనలతో అఫిడవిట్ దాఖలు చేసింది.
-
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు











Click it and Unblock the Notifications