టిడిపి నుండి వలసలు షురూ : మాజీ మంత్రి రావెల గుడ్ బై : రేపు జనసేనలోకి ఎంట్రీ..!
Recommended Video

ఎన్నికలు సమీపిస్తున్ వేళ..ఏపిలో అధికార పార్టీ నుండి వలసలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీని ఫిరాయింపుల తో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి చేసింది. కేంద్రపై యుద్దం పేరుతో బిజెపిని ప్రజలకు దూరం చేయటం లో కొంత వరకు సక్సెస అయింది. ఇక, రాజకీయంగా పై చేయి సాధించేందుకు టిడిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సమయంలో..ఆ పార్టీ నుండి వలసలు ప్రారంభమయ్యాయి. పార్టీ అధికారంలో ఉండటంతో ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అయితే, ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తరువాత రాజకీయంగా వలసలు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపిలో అధికార పార్టీ లో ఉన్న అసంతృప్త నేతలు బయట పడుతున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా సీటు దక్కిం చుకొని..ఆ తరువాత అంతే అనూహ్యంగా మంత్రి పదవులు దక్కించుకున్న వారు సైతం ఈ లిస్టులో ఉన్నారు. 2014 లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి సడన్ గా టిక్కెట్ దక్కించుకున్న మాజీ రైల్వే అధికారి రావెల కిషోర్ బాబు క్యాబినెట్ విస్తరణ లో ఎవరూ ఊహించని విధంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. సాంఘిక - గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, పని తీరు..పార్టీలో సమన్వయంలో ఆయన పై వ్యతిరేకత కనిపించింది. దీంతో.. గత ఏడాది ఫిబ్రవరి లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన్ను మంత్రి పదవి నుండి తొలిగించారు. అప్పటి నుండి రావెల కిషోర్ బాబు ఒకింత అసంతృప్తితోనే ఉన్నారు. అప్పటి నుండి వైసిపి..జనసేన పార్టీల్లోకి ఎంట్రీ కోసం ప్రయత్ని స్తున్నట్లు సమాచారం. వైసిపి లో సీటు పై హామీ లభించలేదని తెలుస్తోంది. దీంతో..రెండు సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాన్ తో సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ నుండి వచ్చిన హామీ మేరకు జనసేన లో చేరాలని రావెల కిషోర్ బాబు డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 1న ఆయన టిడిపికి రాజీనామా చేసి..జనసేనలో చేరుతారని విశ్వసనీయ సమాచారం.

ఇక, రావెల లాగానే మరి కొంత మంది అధికార పార్టీ నేతలు సైతం తమ రాజకీయ భవిష్యత్ పై డైలమా లో ఉన్నారు. దీంతో...కొందరు అధికార పార్టీ నుండి వైసిపి .. జనసేన పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం. విశాఖ జిల్లా లో కీలక నేత ఒకరు జనసేన నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా నుండి మాజీ ఎంపి..ప్రస్తుత ఎమ్మెల్యే సైతం టిడిపిని వీడటం ఖాయమనే ప్రచారం. ఇక, ప్రకాశం జిల్లాలో ఇద్దరు ప్రస్తుత ఎమ్మెల్సీలు వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ల ఖరారు సై స్పష్టత ఇస్తే సరి..లేకుంటే పార్టీ మారటానికి సిద్దంగా ఉన్నట్లు ఆ జిల్లాలో జోరుగా ప్రచారంలో ఉంది. టిడిపి అధినేత అనూహ్యంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటంతో...ఎవరి సీట్లకు ఎర్త్ పెడతారో అనే చర్చ కూడా టిడిపి వర్గాల్లో సాగుతోంది. తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తరువాత..అక్కడి ఫలితాల ఆధారంగా ఏపి లో కాంగ్రెస్ - టిడిపి పొత్తు పై ఓ స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక, వైసిపి లో సీట్లు రాని వారు సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలకు వైసిపి సమన్వయకర్తలను ప్రకటించారు. వారే దాదాపు నియోజకవర్గాల నుండి వైసిపి అభ్యర్ధులుగా పోటీ చేయనున్నారు. దీనికి తోడు కొన్ని నియోజకవర్గాల్లో వైసిపి ఇన్ఛార్జ్ లుగా పని చేసిన వారిని మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. దీంతో..ఈ అసంతృప్తుల్లో అధిక శాతం పార్టీ మారే అవకాశాలు లేక పోలేదు. ఇదే సమయంలో..జనసేనలో అభ్యర్ధుల హంగామా పెద్దగా లేకపోవటంతో.. ఆ పార్టీలోకి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు కొందరు నేతలు సిద్దమవుతున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications