కాల్మనీ సెక్స్ రాకెట్, టీడీపీ నేతలపై రాజ్నాథ్కు ఫిర్యాదు చేశా.. ఎందుకంటే: జీవీఎల్
అమరావతి/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నేతలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు బుధవారం హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ నేతలు హద్దు మీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు చేసే తప్పుడు పనులను ఏ విధంగా అడ్డుకోవాలో తమకు తెలుసునని చెప్పారు.
తనపై పిచ్చిగా మాట్లాడిన వారిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫిర్యాదు చేశానని జీవీఎల్ నర్సింహా రావు చెప్పారు. 2014కు ముందు పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఆ తర్వాత బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాచారని తెలిపారు. యూటర్న్ ముఖ్యమంత్రిగా ఆయన ఒక్కరు చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.
సెక్స్ రాకెట్, అధికార దుర్వినియోగం
ఈ మేరకు జీవీఎల్ నర్సింహా రావు ట్వీట్ కూడా చేశారు. తాను రాజ్నాథ్ సింగ్ను వ్యక్తిగతంగా కలిసి టీడీపీ నేతల క్రిమినల్ బిహేవియర్ పైన ఫిర్యాదు చేశానని, ముఖ్యంగా కాల్ మనీ - సెక్స్ రాకెట్, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బుద్ధా వెంకన్న పైన కూడా ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం చేయడంపై ఫిర్యాదు చేశానని చెప్పారు.

ఉత్తుత్తి కంప్లయింట్
కాగా, జీవీఎల్ నర్సింహా రావుపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. దీనిపై జీవీఎల్ స్పందించారు. 'మా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన చంద్రబాబు గారికి సభ ఉల్లంఘన హక్కుల నోటీసు ఇవ్వాలని ఈ రోజు ఉదయం మాణిక్యాలరావు గారు అసెంబ్లీ సెక్రటేరియట్ ను సంప్రతించారు. ఈ విషయం తెలిసిన టీడీపీ ముందుగ నాపై 'ఉత్తిత్తి' కంప్లైంట్ చేసి తమ భయాన్ని చాటి చెప్పారు. ఇది చవకబారు ప్రయత్నం మాత్రమే!' అని ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా 'సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుగారితో ప్రవర్తించిన తీరు చూస్తే "పిచ్చి పీక్స్" కు చేరినట్లు తెలుస్తోంది. మహా ఫ్రస్ట్రేషన్లో వున్న సీఎం "అసెంబ్లీ రౌడీ" లాగా ప్రవర్తించారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే ఆలోచన.' అని ట్వీట్ చేశారు.

జీవీఎల్ పైన బుద్ధా వెంకన్న ఆగ్రహం
జీవీఎల్కు దేహశుద్ధి తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంగళవారం హెచ్చరించారు. జీవీఎల్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. జీవీఎల్ పిచ్చోడని, ప్రధాని మోడీ పిచ్చోడు చేతికి రాయి ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబును విమర్శించడానికే జీవీఎల్కు ఎంపీ పదవి ఇచ్చారన్నారు. మొన్నటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్నే పిచ్చోళ్లు ఉన్నారని అనుకున్నామని, ఇప్పుడు బీజేపీలో కూడా ఉన్నారన్నారు. జీవీఎల్ను బెదిరించడానికో లేక హెచ్చరించడానికో కాదని, నోటీకి హద్దు పద్దు ఉండాలని, బీజేపీ, వైసీపీ పార్టీలకు రోజులు దగ్గరపడ్డాయన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications