బరితెగించిన బాబు, ప్రతిపక్ష నేతపై విజయసాయి విసుర్లు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు బరితెగించారని విమర్శించారు. ఒకప్పుడు తిమ్మిని బమ్మిని చేస్తూ రాష్ట్రాన్ని శాసించిన చంద్రబాబు, ఇవాళ తనొక అనామకుడిలా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం జగన్ ను దుర్భాషలాడాడని పేర్కొన్నారు. కానీ జగన్ హుందాగా వ్యవహరించి, తీర్పు చెప్పే అవకాశాన్ని ప్రజలకే వదిలేశారని పేర్కొన్నారు. జనం తీర్పు చూసి బాబుకు మైండ్ బ్లాంక్ అవుతోందని వివరించారు.
దీంతో ప్రజలు పచ్చ పార్టీని 10 మైళ్ల లోతున పాతిపెట్టారని విజయసాయి ఎద్దేవా చేశారు. అటు సీఎం జగన్పై విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. సేవ చేసేందుకే రాజకీయ పార్టీలు స్థాపిస్తుంటారనే విషయం ప్రస్తావించారు. ప్రజావిశ్వాసం చూరగొని అధికారంలోకి రాగలిగితేనే వారిని ఆదుకునే అవకాశం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. అలా జగన్కు అవకాశం వచ్చిందని.. దానిని ఆయన సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.

చాలా మంది నేతలు గెలిచాక చేద్దాం, చూద్దాం అనుకుంటుంటారని విజయసాయిరెడ్డి తెలిపారు. 20 నెలల్లో రూ.80 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేయడం కేవలం జగన్కు మాత్రమే సాధ్యమైందని కొనియాడారు. మరే లీడర్ ఇలా పనిచేయలేదని స్పష్టంచేశారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ అని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఆహోరాత్రులు శ్రమిస్తున్నారని తెలియజేశారు. ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు అని స్పష్టంచేశారు. బడుగు, బలహీనవర్గాల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. దీంతో ఆ వర్గాలకు మేలు జరుగుతుందని వివరించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications