అనంతపురం-గుంటూరు మధ్య భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
అనంతపురం: రాయలసీమలో కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉండే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనంతపురం నుంచి అటు విజయవాడ, ఇటు గుంటూరులను అనుసంధానించేలా రూపొందించిన రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు వేగం పుంజుకొన్నాయి.
బెంగళూరు నుంచి విజయవాడకు అనుసంధానించేలా చేపట్టిన గ్రీన్ఫీల్డ్ హైవే పనులు ఇదివరకే మొదలయ్యాయి. గోరంట్ల-కదిరి-పులివెందుల, యర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం సాగుతుంది. నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం, ప్రకాశం జిల్లా కంభం, పామూరు, కనిగిరి, అద్దంకి మీదుగా ముప్పవరం వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. ముప్పవరం అక్కడి జాతీయ రహదారితో దీన్ని కనెక్ట్ చేస్తారు. నాలుగు ప్యాకేజీలుగా దీన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.

అటు అనంతపురం గుంటూరు మధ్య 9,000 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో చేపట్టిన నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ హైవేకు కేంద్రం ఇదివరకే 544డీ నంబర్ను కేటాయించింది. ఈ రోడ్డు పొడవు 418 కిలోమీటర్లు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 32,000 కోట్ల అంచనా వ్యయంతో అనంతపురం నుంచి అమరావతికి ఆరు లేన్ల ఎక్స్ప్రెస్ వేను ప్రతిపాదించింది గానీ అది పట్టాలెక్కలేదు.
దీనికోసం 22,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి రావడం, దీన్ని భరించడానికి అటు కేంద్రం గానీ, చంద్రబాబు ప్రభుత్వం గానీ ఆసక్తి చూపలేదు. నంద్యాల దాటిన తరువాత ఈ రహదారి నల్లమల్ల పులుల అభయారణ్యం నుంచి వెళ్లేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడం వల్ల పర్యావరణ అనుమతులు లభించలేదు.
ఈ జాతీయ రహదారి కోసం అటవీ భూములను కేటాయించడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురం - అమరావతి ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టును పునఃసమీక్షించింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పొందటం కష్ట సాధ్యమని గుర్తించింది.
ప్రత్యామ్నాయంగా అనంతపురం-గుంటూరు మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఏపీ ఇన్ఫ్రా స్టోరీ.. తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications