జేసీ దివాకర్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి, భేటీపై చర్చ
అనంతపురం: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కలిశారు. ఆయన వెంట టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఉండటం గమనార్హం. వీరిద్దరూ కలిసి అనంతపురం తాడిపత్రికి వెళ్లారు.
జేసీ ఫాంహౌస్లో భేటీ..
జూటురులోని జేసీ దివాకర్ రెడ్డి ఫాంహౌస్లో ఆయనను కలిసిన సీఎం రమేష్, బీటెక్ రవిలు సుమారు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన వివిధ రకాల పంటలను ఎంపీ రమేష్, బీటెక్ రవిలు పరిశీలించారు. అయితే, వీరు తమ భేటీలో ప్రస్తుత కరోనావైరస్ గురించి, వ్యవసాయ రంగం గురించిన చర్చించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఏం చర్చించారంటే..
అయితే, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో కలిసి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ జేసీని కలవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జేసీ దివాకర్ రెడ్డి ఏమైనా బీజేపీకి దగ్గరవుతున్నారా? అనే చర్చ సాగుతోంది. అయితే, జేసీ వర్గీయులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. పాత స్నేహితులు కావడంతో కలిశారని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు.

అలాంటిదేం లేదు..
కేవలం తన యోగ క్షేమాలు అడిగి తెలుసుకునేందుకే రమేష్, రవిలు వచ్చారని జేసీ కూడా స్పష్టం చేశారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని చెప్పారు.
కాగా, టీడీపీలో ఎంపీగా ఉన్న సీఎం రమేష్ 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీటెక్ రవి టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే, గత కొంత కాలంగా జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించికుంది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications