గుప్తనిధి కోసం ఇవ్వడానికి బాలిక నిర్బంధం
గుంటూరు: గుప్తనిధి కోసం బలి ఇవ్వడానికి నలుగురు వ్యక్తులు 13 ఏళ్ల బాలికనలు నిర్బంధించారు. ఆ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గుప్తనిధి కోసం బాలికను బలి ఇవ్వడానికి నలుగురు వ్యక్తులు పథకం రచించారు.
గుంటూరులోని ధూళిపూడిలో గుప్తనిధి ఉందని నిందితుడు వై. వెంకటప్రసాద్ భావించాడు. అతనూ అతని మిత్రులు ఓ మంత్రగాడిని సంప్రదించారు. గుప్తనిధిని సొంతం చేసుకోవడానికి దైవాన్ని సంతృప్తి పరచాల్సి ఉంటుందని, అందుకు కన్యను బలి ఇవ్వాల్సి ఉంటుందని మంత్రగాడు వారికి చెప్పాడు.
ప్రత్యేక పూజల కోసం కావాలంటూ బాలిక తల్లితండ్రులకు ఆ నలుగురు వ్యక్తులు నచ్చజెప్పారు. వారు గోయి తవ్వుతున్నారని గ్రహించిన స్థానికులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, బాలికకు విముక్తి కలిగించారు.
తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.