వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి వైపు జగన్ ఎమ్మెల్యేల చూపు, 30మంది వరకు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

2 Krishna YSRCP MLAs seeing at TDP
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు షాకివ్వనున్నారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలతో టచ్‌లో ఉన్నారట. వారు ఎప్పటికప్పుడు వారితో సంప్రదింపులు జరుపుతున్నారట. ఎమ్మెల్యేలతో పాటు పలువురు కార్పోరేటర్లు టిడిపిలో చేరేందుకు సంసిద్ధత చూపుతున్నారట.

తాము టిడిపిలో చేరుతామని వారు స్థానిక నేతలకు చెబుతున్నారట. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లారని సమాచారం. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నీ మాట్లాడుతామని, ఇప్పుడు వద్దని తెలుగు తమ్ముళ్లకు సూచించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇరవై నుండి ముప్పై మంది వరకు...!

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఇరవై నుండి ముప్పై మంది ఎమ్మెల్యేల వరకు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. కాబట్టి ఒక్కరొక్కరిని కాకుండా.. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందర్నీ ఒకేసారి చేర్పించుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారట.

గతంలో కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరిగింది. టిడిపిలో చేరాలని చూస్తున్న వారిలో భూమా నాగిరెడ్డి కూడా ఉన్నట్లు చెప్పారు. అయితే వారు ఆ వార్తలను ఖండించారు. తెలంగాణలోను జగన్ పార్టీ నుండి గెలిచిన వారు తెరాస వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిని కూడా వారు ఖండించారు.

English summary
It is said that Two Krishna district MLAs may join in Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X