వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: 5636కు చేరిక

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 11,775 మంది నమూనాలు పరీక్షించగా 207 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ తెలిపింది. వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు వారివే 66 ఉండగా, రాష్ట్రంలో 141 పాజిటివ్ కేసులు వచ్చాయి.

పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 5636 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు.

207 new COVID-19 cases in AP; aggregate rises to 5,636

రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 80, ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2559కి చేరింది. ప్రస్తుతం వివిధ కరోనా ఆస్పత్రుల్లో 1723 మంది చికిత్స పొందుతున్నారు.

కాగా, దేశంలో 2,98,141 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,42,445 యాక్టివ్ కేసులున్నాయి. 1,47,173 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 8,508 మంది కరోనా బారినపడి మరణించారు. కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 97,648 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3590 మంది మరణించారు.

English summary
207 new COVID-19 cases in AP; aggregate rises to 5,636.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X