ఏపీలో తగ్గిన కరోనా కేసులు, 12వేలు దాటిన మరణాలు: రికవరీ డబుల్, 75వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా 6వేలకు దిగవనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 96,153 నమూనాలను పరీక్షించగా.. 5,741 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 5741 కరోనా కేసులు, 53 మరణాలు
తాజాగా నమోదైన 5741 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,20,134కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 53 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది మరణించగా, తూర్పుగోదావరిలో ఆరుగురు, కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కర్నూలు, నెల్లూరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 12,052కు చేరింది.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 75వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,567 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 17,32,948కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య రెట్టింపు ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 75,134 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,06,34,891 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 831 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో 130 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 3 53, చిత్తూరులో 830 , తూర్పుగోదావరిలో 831, గుంటూరులో 385, కడపలో 325, కృష్ణాలో 463, కర్నూలులో 130, నెల్లూరులో 266, ప్రకాశంలో 463, శ్రీకాకుళంలో 428, విశాఖపట్నంలో 339, విజయనగరంలో 225, పశ్చిమగోదావరిలో 703 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,49,297, చిత్తూరులో 2,09,808 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకు మించిపొయాయి.












Click it and Unblock the Notifications