Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..!
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు-బెంగళూరు ప్రధాన రహదారిపై పలమనేరు నియోజకవర్గంలోని మొగిలి ఘాట్ వద్ద రెండు లారీలు, బస్సు ఢీకున్నాయి. భారీ స్థాయిలో ప్రమాదం జరగడంతో ఘటనా స్థలంలోనే 6గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.
గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సు పలమనేరు నుంచి తిరుపతి వెళ్తోంది. రెండు లారీలు, బస్సు ఢీకొని టెంపోపైకి వెళ్లాయి. దీంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరితో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన తమిళనాడులోని వేల్గూరు హస్పిటలక్ కు తరలించారు.

రోడ్డు ప్రమాదంపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచి వేసిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖకు సూచించారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతి వేగం ఎప్పుడూ ప్రమాదకరమేనని పోలీసులు చెబుతున్నారు.
అతివేగంతో వెళ్లడం థ్రిల్ అనిపిస్తుంది. కానీ అది మన ప్రాణాల్ని తీస్తుందని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. దాదాపు అన్ని రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణంగా చెబుతున్నారు. రోడ్డుపై నిర్దేశించిన వేగంతోనే వెళ్లాలని పోలీసులు కోరారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications