చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐ లవ్ యూ చెప్పలేదని బాలికపై హత్యాయత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లా జిల్లాలో అత్యంత దారుణమైన అవాంఛనీయమైన సంఘటన చోటు చేసుకుంది. పిల్లల్లోకి కూడా ప్రేమ వ్యవహారం చొచ్చుకుపోయి అవాంఛనీయమైన సంస్కృతికి దారి తీస్తోంది. ఐ లవ్ యూ చెప్పలేదని ఓ ఎనిమిదేళ్ల వయస్సు గల బాలుడు మూడేళ్ల బాలికపై హత్యాయత్నానికి ఒడిగట్టాడు.

ఆ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో సోమవారంనాడు చోటు చేసుకుంది. స్థానిక కాలనీలో కూలీ పనులు చేసుకుంటూ ఓ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలిక తనకు ఐ లవ్ యూ చెప్పలేదని పక్కనే నివాసం ఉంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ఆగ్రహించాడు.

8 years old boy attempts kill 3 years old girl

మూడో తరగతి చదవుతున్న ఆ బాలుడు ఆ బాలికను ఇంటి సమీపంలోనికి తీసుకుని వెళ్లి ఐ లవ్ యూ చెప్పాలని వేధించాడు. మొండికేసిన బాలిక అందుకు నిరాకరించింది. దాంతో అతను ఆ బాలిక గొంతుకు తాడుతో ఉరేసి చంపే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో బాలిక కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఆ బాలుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందిచారు. మదనపల్లె టూటౌన్ పోలీసులు ఆ బాలుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A 8 years old boy attempted kill 3 years old girls at Madanapalle in Chittoor district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X