9మంది అరెస్ట్: అరకిలో గోల్డ్, కారు, 3సెల్ఫోన్లు, ట్యాబ్ సీజ్(పిక్చర్స్)
విశాఖపట్నం: నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన 9మంది నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారినుంచి 389 గ్రాముల బంగారం, టొయాటో ఇటియోస్ కారు, టాటా మ్యాజిక్ వ్యాను, మూడు సెల్ఫోన్లు, ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు.
కమిషనరేట్ సమావేశ మందిరంలో క్రైం డిసిపి ఎస్ వరదరాజు ఈ మేరకు వివరాలను మీడియాకు తెలిపారు. 4వ పట్టణ పిఎస్ పరిధిలో మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న గాజువాక వడ్లపూడికి చెందిన మిరియాల సతీష్కుమార్, మద్దిల పాలెంలోని వెంపాడవీధికి చెందిన మెహతా కనకరాజులు చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిద్దరు 2012 నుంచి 17 నేరాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 420 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
పనిచేస్తున్న యజమానికే శఠగోపం పెట్టిన పిఎంపాలెంలోని గాయత్రినగర్కు చెందిన దొమ్మేటి అశోక్కుమార్ను 4వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 15న నిందితుడు తన యజమాని శాంతిపురంలో నివసిస్తున్న అపార్ట్మెంట్ వద్దకు వచ్చి కారుతో సహా పరారయ్యాడు. గురువారం ఉదయం నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో నలుగురు చైన్ స్నాచర్లతోపాటు ఇద్దరు దొంగలను కూడా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని నగర ఇంఛార్జ్ పోలీస్ కమిషనర్ అతుల్ సింగ్ తరపున క్రైం ఏడిసిపి వరదరాజు అభినందించారు.

సీజ్ చేసిన బంగారు ఆభరణాలు
నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన 9మంది నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

స్వాధీనం చేసుకున్న కారు
వారినుంచి 389 గ్రాముల బంగారం, టొయాటో ఇటియోస్ కారు, టాటా మ్యాజిక్ వ్యాను, మూడు సెల్ఫోన్లు, ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు వెల్లడిస్తూ..
కమిషనరేట్ సమావేశ మందిరంలో క్రైం డిసిపి ఎస్ వరదరాజు ఈ మేరకు వివరాలను మీడియాకు తెలిపారు.

వివరాలు వెల్లడిస్తూ..
నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని నగర ఇంఛార్జ్ పోలీస్ కమిషనర్ అతుల్ సింగ్ తరపున క్రైం ఏడిసిపి వరదరాజు అభినందించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications