రూ.1500కోట్ల భూకబ్జా: నారా లోకేష్పై సీబీఐకి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీబీఐకి ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలోని దసపల్లా హిల్స్ భూ కుంభకోణానికి సంబంధించి లోకేష్పై సీబీఐకి ఫిర్యాదు చేశారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీబీఐకి ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలోని దసపల్లా హిల్స్ భూ కుంభకోణానికి సంబంధించి లోకేష్పై సీబీఐకి ఫిర్యాదు చేశారు.
రూ.1500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో వైయస్సార్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. కురుపాం రాజవంశస్థురాలు రాణీ కమలమ్మను బినామీగా చేర్చారని చెప్పుకొచ్చారు.

ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాలను సీబీఐకి అందజేసినట్లు తెలిపారు. పోలీసులు న్యాయం చేయకపోతే ఈ భూ కుంభకోణం వ్యవహారంపై హైకోర్టుకు కూడా వెళ్తామంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు.












Click it and Unblock the Notifications